రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-08T06:16:30+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం రెండో ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడ, ఆగస్టు 7 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం రెండో ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురా సుందరీదేవి అమ్మవారి కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.