రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-10-08T05:58:29+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ, అక్టోబరు 7 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజల్లో పాల్గొన్నారు. కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్, కోడెమొక్కుల క్యూలైన్తోపాటు ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.