జేపీ దర్గాలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-24T04:37:14+05:30 IST

హజ్రత్‌ జహం గీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ముగిసిన

జేపీ దర్గాలో భక్తుల రద్దీ
భక్తులతో కిక్కిరిసిన దర్గా పరిసరాలు

కొత్తూర్‌, జనవరి 23 : హజ్రత్‌ జహం గీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ముగిసిన తర్వాత సెలవు దినమైన ఆదివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 20నుంచి మూడు రోజులపాటు సాగిన దర్గా ఉత్సవాలకు కరోనా వైరస్‌ కారణంగా భక్తుల తాకిడి అంతగా కనిపించలేదు. అయితే ఆదివారం సెలవుదినం రావడంతో రాష్ట్ర రాజధాని నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. 



Updated Date - 2022-01-24T04:37:14+05:30 IST