అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పథకాల నిలిపివేత అన్యాయం

ABN , First Publish Date - 2021-07-25T05:50:36+05:30 IST

రాష్ట్రంలో వివిధ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయమని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్‌ మాదిగ అన్నారు. శనివారం అద్దంకిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పథకాల నిలిపివేత అన్యాయం

అద్దంకి టౌన్‌, జూలై 24 : రాష్ట్రంలో వివిధ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులకు  ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయమని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్‌ మాదిగ అన్నారు. శనివారం అద్దంకిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది మంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలేనన్నారు. అలాంటి వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తూ అమ్మఒడి, చేయూత, వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ వంటివి వర్తించకుండా చేయడం  దుర్మార్గమన్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. సమావేశంలో అద్దంకి, ఒంగోలు, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆమోస్‌ మాదిగ, కన్నా మాదిగ,  జయరాజ్‌మాదిగ, శ్రీను మాదిగ తదతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:50:36+05:30 IST