ఆస్తుల వివరాలను దాఖలు చేయండి

ABN , First Publish Date - 2021-12-12T13:39:40+05:30 IST

ఐఏఎస్‌ అధికా రులు తమ పేర్లు, కు టుంబసభ్యుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు సమర్పించాలని ఉత్తర్వు లు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు ఐఏఎస్‌ అధికారులకు రాసిన లేఖలో, రాష్ట్రంలో

ఆస్తుల వివరాలను దాఖలు చేయండి

                    - ఐఏఎస్‌ అధికారులకు సీఎస్‌ ఉత్తర్వులు


పెరంబూర్‌(చెన్నై): ఐఏఎస్‌ అధికారులు తమ పేర్లు, కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు ఐఏఎస్‌ అధికారులకు రాసిన లేఖలో, రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు 2022 జనవరి 31వ తేదీలోపు తమ ఆస్తుల వివరాలు తెలియజేయాలన్నారు. సదరు అధికారి పేరిట, కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలు సమర్పించాలని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-12T13:39:40+05:30 IST