రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ పనితీరు భేష్: సీఎస్

ABN , First Publish Date - 2021-03-05T00:03:43+05:30 IST

రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వేగంగా క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ పనితీరు భేష్: సీఎస్

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వేగంగా క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసారు. రిజిస్ట్రేషన్ శాఖ లో అన్ని స్థాయిలలో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి, సీఎస్  సోమేశ్ కుమార్ కు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


రిజిస్ట్రేషన్లకు గల డిమాండ్ నేపధ్యంలో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి, 2021 మాసంలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. తదనుగుణంగా, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను అన్ని అదివారాలు (మార్చి 7, 14, 21, 28 తేదీలలో), రెండవ శనివారం (మార్చి13) లలో కూడా పనిచేసేందుకు తెరిచివుంచాలని నిర్ణయించింది. కాబటి అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు మార్చి మాసంలో మహాశివరాత్రి (మార్చి11), హోళి (మార్చి29) రోజులలో తప్ప మిగత అన్ని రోజులలో తెరిచివుంటాయి.


ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోగలరని కోరారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమీషనర్, ఐజీ శేషాద్రి , అసోసియేషన్ ప్రెసిడెంట్ స్ధిత ప్రజ్ఞ, కన్వీనర్ మరియు టిఎన్జిఓ హైదరాబాద్ నగర అద్యక్షుడు ముజిబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్ నరేష్ గౌడ్ పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T00:03:43+05:30 IST