నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదని అర్థమైంది: ఏబీవీ

ABN , First Publish Date - 2022-05-19T22:10:10+05:30 IST

ఏపీ సెక్రటేరియట్‌కు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. జీఏడీలో ఆయన రిపోర్టు చేశారు. జాయినింగ్ రిపోర్టుతో సీఎస్‌ను కలిసేందుకు ఏబీవీ ప్రయత్నించారు.

నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదని అర్థమైంది: ఏబీవీ

అమరావతి: ఏపీ సెక్రటేరియట్‌కు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. జీఏడీలో ఆయన రిపోర్టు చేశారు. జాయినింగ్ రిపోర్టుతో సీఎస్‌ను కలిసేందుకు ఏబీవీ ప్రయత్నించారు. అయితే రిపోర్టును పేషీలో ఇచ్చి వెళ్లాలని ఏబీవీకి సీఎస్‌ సూచించారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జీఏడీలో జూనియర్‌ అధికారులుంటారని, సివిల్‌ సర్వీసెస్‌ సంప్రదాయాల ప్రకారం జూనియర్లకు రిపోర్ట్‌ చేయకూడదన్నారు. సీనియర్‌ అధికారి లేకపోతే వారి పీఏకు ఇవ్వాలనడం సంప్రదాయమని తెలిపారు. ఆఫీస్‌లో సీఎస్‌ ఉండి కూడా రిపోర్ట్‌ పేషీలో ఇచ్చేసి వెళ్లిపోమన్నారని చెప్పారు బిజీగా ఉంటే రేపు సమయమిచ్చి రమ్మని ఉంటే బాగుండేదన్నారు. తనను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదని అర్థమైందని తెలిపారు. ఏదేమైనా తన పని రిపోర్ట్‌ చేయడం వరకేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.



Updated Date - 2022-05-19T22:10:10+05:30 IST