సీఎస్ కు పుస్తకాలను బహూకరించిన డిజి ఉమేష్ షర్రాఫ్
ABN , First Publish Date - 2022-05-20T21:05:04+05:30 IST
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్పిఎఫ్. డీజీ ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు.
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్పిఎఫ్. డీజీ ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు. బి ఆర్కే భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమేష్ షర్రాఫ్ రచించిన క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలను సవివరంగా ఆయన అందజేశారు. పోలీస్ అధికారులకు ఈ క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని సి.ఎస్. సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఉమేష్ షర్రాఫ్ ను సీఎస్ అభినందించారు.