ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి: సీఎస్

ABN , First Publish Date - 2021-09-19T00:37:00+05:30 IST

ద్యోగులంతా తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.

ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి: సీఎస్

హైదరాబాద్: ఉద్యోగులంతా తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివరణలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవడం వల్ల కోవిడ్ బారీ నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. శనివారం బిఆర్ కె ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగుల కోసం శనివారం చేపట్టిన రెండవ విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రభుత్వ సీఎస్ పరిశీలించారు. 


రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు  కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తో సహా సచివాలయ ఉద్యోగులకు జూన్ 11, 12 తేదీలలో రెండురోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేసి మొదటి విడత టీకాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఉద్యోగులందరు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.ఎ.డి. జాయింట్ సెక్రెటరీ చిట్టిరాణి, డిప్యూటి డిఎంహెచ్ వో డా.పద్మజ  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T00:37:00+05:30 IST