రాష్ట్రంలో సింగల్ పిక్ కాటన్ సాగుకు ప్రోత్సాహం -Cs somesh kumar

ABN , First Publish Date - 2022-05-26T00:25:24+05:30 IST

రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్‌ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar) బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో సింగల్ పిక్ కాటన్ సాగుకు ప్రోత్సాహం -Cs somesh kumar

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు  సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్‌ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar) బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఉత్పాదకతను పెంపొందించడంతోపాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్‌ పిక్ పత్తిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. సింగిల్ పిక్ పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందనీ పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంట ను వేస్తున్నారని వివరించారు. ఈ పట్టి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ పిక్‌ పత్తి సాగు చేయించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 


గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్‌ నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలని అన్నారు. ఈ  సింగిల్ పిక్ పత్తి వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రైతులను చైతన్య పర్చాలని సూచించారు.హెచ్‌డిపిఎస్ (హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల  సమావేశం నిర్వహించి, ఈ సింగల్ పిక్ పత్తిని సాగు చేసే  రైతుల నమోదు చేయించాలని ఆదేశించారు. 


దీనికోసం రైతు ప్రొఫైల్‌, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్‌ తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని అన్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం రఘునందన్‌ రావు, పీజేటీఎస్‌ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, స్పెషల్ కమిషనర్ అగ్రికల్చర్ హనుమాన్ కె జెండగే, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T00:25:24+05:30 IST