గాంధీ ఆస్పత్రిని సందర్శిఇంచిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2021-05-08T00:44:28+05:30 IST

కోవిడ్‌ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శురక్రవారం సందర్శించారు.

గాంధీ ఆస్పత్రిని సందర్శిఇంచిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: కోవిడ్‌ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శురక్రవారం సందర్శించారు. కోవిడ్‌ పేఫెంట్ల కోసం ఆస్పత్రిలోని లైబ్రరీ భవనంలో ఏర్పాటు చేసిన 160 అదనపు పడకలను పరిశీలించారు. త్వరలో వీటిని ప్రారంభిస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈసందర్భంగా సీఎస్‌ ఆక్టర్లు,, ఇతర స్టాఫ్‌తో ఇంటరాక్ట్‌ అయ్యారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను సీఎస్‌ ప్రశంసించారు. అలాగే హాస్పత్రిలో ఏర్పాటుచేసిన నూతన ఆక్సీజన్‌ ప్లాంట్‌ను కూడా సీఎస్‌ పరిశీలించారు. దాదాపు 400 మంది పేఫెంట్లకు రోజుకు 4 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ను అందించే స్థోమత ఇందులో ఉందని అధికారులు వివరించారు. 


ఆస్పత్రిలో శానిటేషన్‌ పనులు, క్లీనింగ్‌, స్ర్టీట్‌ లైటింగ్స్‌, ఆక్సీజన్‌ పైప్‌లైన్‌లను కూడా పర్యవేక్షించారు. రోగులు త్వరంగా కోలుకునేలా మంచి సౌకర్యాలను  కల్పించాలని అన్నారు. ఈ పనులన్నీ ఒకేసారి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా సీఎస్‌ వెంట పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్వి రిజ్వీ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T00:44:28+05:30 IST