నేడు సిద్దిపేట జిల్లాలో సీఎస్ సోమేష్కుమార్ పర్యటన
ABN , First Publish Date - 2022-06-14T12:41:24+05:30 IST
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎస్ సోమేష్కుమార్ పర్యటించనున్నారు.
సిద్దిపేట: నేడు సిద్దిపేట జిల్లాలో సీఎస్ సోమేష్కుమార్ పర్యటించనున్నారు. ములుగు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎస్ అక్కడకు వెళ్లనున్నారు. ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ములుగు రైతు వేదికలో మంత్రి హరీష్రావు, సీఎస్ రైతులతో మాట్లాడతారు. ధరణి పోర్టల్ సమస్యలపై రైతులతో మంత్రి చర్చించనున్నారు. అలాగే వర్షకాల పంటలకు సంబంధించిన విషయాలపై రైతులకు మంత్రి హరీశ్రావు, సీఎస్ పలు సూచనలు అందించనున్నారు.