సాగు రైతులకు హక్కులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-03-07T05:17:05+05:30 IST

పద్మాపురం ఇనాం భూముల్లో సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పిం చాలని భూముల సాధన పోరాట కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వర రావు డిమాండ్‌ చేశారు.

సాగు రైతులకు హక్కులు కల్పించాలి

పాచిపెంట, మార్చి 6: పద్మాపురం ఇనాం భూముల్లో సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పిం చాలని భూముల సాధన పోరాట కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వర రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బొబ్బిలివలస, సీతంపేట జంక్షన్‌ వద్ద రైతులు నిరసన ర్యాలీ నిర్వహించా రు. 1956లో ఇనాం జమిందార్‌ చట్టాలు రద్దయినా ఇంతవరకు పాలకులు ఆ సమస్యకు పరిష్కారం చూపలేదని తెలిపారు. ఐదు పంచాయతీల్లో సుమారు 2,500 ఎకరాల భూములను రైతులు సాగు చేస్తున్నారని, కానీ వారికి ఎటువంటి భద్రత హక్కులు లేవన్నారు.  దీనివల్ల ప్రభుత్వం నుంచి రావలసిన రుణాలు, పథకాలు అందడం లేదని ఆయన వాపోయారు. కార్యక్రమంలో నీడ్‌ స్వచ్ఛంద సంస్థ ఈడీ పి.వేణుగోపాలరావు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T05:17:05+05:30 IST