కర్ఫ్యూ అమలు పరిశీలన
ABN , First Publish Date - 2021-05-10T05:24:44+05:30 IST
రాజమహేంద్రవరంలో పాక్షిక కర్ఫ్యూ అమలును ఆదివారం సాయంత్రం అర్బన్ జిల్లా ఏఎస్పీలు పాపారావు, లతా మాధురి పరిశీలించారు. నగరంలో ఏవీ అప్పారావు రోడ్డు, విమలమ్మ ఆసుపత్రి సెంటర్లలో పరిస్థితిని పాపారావు పరిశీలించారు.
రాజమహేంద్రవరం సిటీ, మే 9: రాజమహేంద్రవరంలో పాక్షిక కర్ఫ్యూ అమలును ఆదివారం సాయంత్రం అర్బన్ జిల్లా ఏఎస్పీలు పాపారావు, లతా మాధురి పరిశీలించారు. నగరంలో ఏవీ అప్పారావు రోడ్డు, విమలమ్మ ఆసుపత్రి సెంటర్లలో పరిస్థితిని పాపారావు పరిశీలించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులను ఆపి అత్యవసర పరిస్ధితుల్లో బయటకు వచ్చిన వారిని పంపించి వేసి అనవసరంగా వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే త్రీటౌన్ పరిదిలో ఆర్యాపురం ఫైర్ స్టేషన్ సెంటర్లో కర్ఫ్యూను లతామాధురి పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.