31 లోపు మిల్లింగ్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-01-22T05:34:55+05:30 IST
రబీ సీజన్లో వచ్చిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఈనెల 31 వరకు 100 శాతం పూర్తి చేయా లని అదనపు కలెక్టర్ రఽఘురామ్శర్మ అన్నా రు.
- అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ
గద్వాల క్రైం, జనవరి 21 : రబీ సీజన్లో వచ్చిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఈనెల 31 వరకు 100 శాతం పూర్తి చేయా లని అదనపు కలెక్టర్ రఽఘురామ్శర్మ అన్నారు. స్పెషల్ అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టరేట్ సమావేశపు హాలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. జిల్లాకు 52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. రైస్ మిల్లులు 24 గంటలు నడిపించాలని మిల్లర్లకు సూచించారు. ఎవరి దగ్గర ఎంత ధాన్యం పెండింగ్లో ఉందో తెలుసుకొని మిగిలిపోయిన ధాన్యం మొత్తాన్ని వేరే మిల్లులకు సమానంగా ఇవ్వాలని పౌరసరఫరా అఽధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన ఆర్ఐలు ప్రతీరోజు రైస్ మిల్లులను పర్యవేక్షణ చేసి రోజు వారీ టార్గెట్ను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లింగ్ చేయని ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించాలని చెప్పారు. ఈనెల 31వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల అధికారి రేవతి పాల్గొన్నారు.