హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల మోసం
ABN , First Publish Date - 2020-07-07T03:56:52+05:30 IST
ఫేస్బుక్లో ఆర్మీ అధికారుల పేరు పెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెహికల్ అమ్ముతామంటూ..
హైదరాబాద్: ఫేస్బుక్లో ఆర్మీ అధికారుల పేరు పెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెహికల్ అమ్ముతామంటూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. ఆర్మీ ఐడీ కార్డు ఉండటంతో వాహన కొనుగోలుకి ప్రయత్నించిన రమేష్.. 82 వేల డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బులు తమ అకౌంట్లోకి డిపాజిట్ అయిన వెంటనే సైబర్ కేటుగాళ్లు ఫోన్లు స్విచాఫ్ చేశారు. దీంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.