సైబర్ నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-09-18T02:10:41+05:30 IST
మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను
కర్నూలు: మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకొని యువతులు, మహిళలపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసామని ఆయన పేర్కొన్నారు. ఒక నెలలోనే జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మి మహిళలు మోసపోవద్దని ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి హెచ్చరించారు.