ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ను ప్రారంభించిన సజ్జనార్
ABN , First Publish Date - 2021-03-06T18:18:09+05:30 IST
గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్: గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లకు సుముఖత స్థానం కోసం ఈ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమి కొనియాడారు. ఎస్సీఎస్సీ ద్వారా చదువుకున్న ట్రాన్స్జెండర్లకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కొన్ని ఐటీ కంపేనిలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కాగ్నిజేట్ కంపేనితో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు.