పర్యావరణ పరిరక్షణపై సైకిల్ ర్యాలీ
ABN , First Publish Date - 2022-01-23T06:07:50+05:30 IST
పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ముచ్చివోలుకు చెందిన యువకులు కోరారు.
శ్రీకాళహస్తి, జనవరి 22: పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్రకృతిని కాపాడుకుందామని మండలంలోని ముచ్చివోలుకు చెందిన యువకులు కోరారు. శనివారం దొడ్లమిట్ట, ముద్దుముడి, ఉడమలపాడు, అక్కుర్తి, కమ్మకొత్తూరు, అరవకొత్తూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్ఎస్ఎస్ పర్యావరణ ప్రముఖ్ రాఘవరెడ్డి మాట్లాడుతూ... ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో దాము, భరత్, కేతినేని గురుశేషు, జయచంద్ర, శివకుమార్, మనోహర్, నారాయణ, హేమంత్కుమార్, అరుణ్కుమార్, శంకర్రెడ్డి పాల్గొన్నారు.