చాగలమర్రికి చేరిన సైకిల్‌యాత్ర

ABN , First Publish Date - 2021-05-09T05:26:53+05:30 IST

పాండిచేరికి చెందిన యువకుడు లోకేష్‌ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్‌యాత్ర చేపట్టాడు.

చాగలమర్రికి చేరిన సైకిల్‌యాత్ర

చాగలమర్రి, మే 8: పాండిచేరికి చెందిన యువకుడు లోకేష్‌ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్‌యాత్ర చేపట్టాడు. శనివారం సైకిల్‌యాత్ర చాగలమర్రికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ 4 రోజుల క్రితం పాండిచేరి నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించామని అన్నారు. తిరుపతి, మదనపల్లి, పీలేరు, కడప మీదుగా చాగలమర్రికి చేరుకున్నామన్నారు. ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలో పర్యటిస్తామని, ఇప్పటి వరకు 500 కి.మీ సైకిల్‌యాత్ర చేశామని అన్నారు. 

Updated Date - 2021-05-09T05:26:53+05:30 IST