ఉత్సాహంగా సైకిల్థాన్
ABN , First Publish Date - 2021-04-19T06:49:30+05:30 IST
అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా నెక్లె్సరోడ్లో జరిగిన సైకిల్థాన్ ఉత్సాహంగా సాగింది.
ఖైరతాబాద్ ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా నెక్లె్సరోడ్లో జరిగిన సైకిల్థాన్ ఉత్సాహంగా సాగింది. తెలంగాణ ఫైర్ రైడ్-2021 పేరుతో 5 కిలోమీటర్ల రైడ్ తెలంగాణ విపత్తుల స్పందన, అగ్నిమాపక సంస్థల సంయుక్తాధ్వర్యంలో జరిగింది. కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బందికి హోంమంత్రి మహమూద్ అలీతోపాటు ఆ శాఖ, పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక శాఖ పరికరాలు, అవి పనిచేసే విధానాన్ని తెలిపే ప్రదర్శనను హోం మంత్రి తిలకించి రైడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అగ్నిప్రమాదాల్లో సిబ్బంది 2019లో 770 కోట్ల ఆస్తులు, 2020లో 7,799 ఆస్తులను కాపాడారన్నారు. 24 గంటల పాటు ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రతి మండలానికి ఒక అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సిబ్బందిలో ఉత్సాహం పెరుగుతుందన్నారు. సైకిల్థాన్లో అగ్నిమాపక శాఖ అధికారులు సంజయ్కుమార్ జైన్, లక్ష్మీప్రసాద్, నారాయణరావు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.