తీరం దాటనున్న బురేవి తుపాన్

ABN , First Publish Date - 2020-12-03T14:01:56+05:30 IST

‘బురేవి’ తుపాన్ తీరం దాటనుంది. బురేవి తుపాన్ గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల ...

తీరం దాటనున్న బురేవి తుపాన్

తిరువనంతపురం : ‘బురేవి’ తుపాన్ తీరం దాటనుంది. బురేవి తుపాన్ గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి త్రికోణమలికి వాయువ్య దిశలో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారతవాతావరణ శాఖ గురువారం తెల్లవారుజామున వెల్లడించింది. బురేవి తుపాన్ ప్రభావం వల్ల త్రివేండ్రం జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకున్నామని తిరువనంతపురం జిల్లా కమిషనర్ నవజోత్ సింగ్ ఖోసా చెప్పారు. తుపాన్ ముప్పు నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, వైమానిక దళం, నావికాదళ సిబ్బందితో 8 బృందాలను సహాయ చర్యల కోసం మోహరించామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. లోతట్టుప్రాంతాల్లో ఉన్న 175 కుటుంబాలకు చెందిన 697 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. బురేవి తుపాన్ ముప్పు దృష్ట్యా గురువారం తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లప్పుజ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

Updated Date - 2020-12-03T14:01:56+05:30 IST