అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2022-06-24T06:43:54+05:30 IST

చెరువు తవ్వకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండల గ్రామం మోరంపూడి సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి

దుగ్గిరాల, జూన్‌23: చెరువు తవ్వకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండల గ్రామం మోరంపూడి సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పేరుకపూడిలో గత ఏప్రిల్‌ నెలలో జరిగిన మం డలగ్రామం పేరుకలపూడిలోని చెరువులో మట్టితవ్వకాలకు సం బంధించి సర్పంచ్‌ గంగాధర్‌, ఆళ్ల మహేష్‌లపై, అదే గ్రామానికి చెం దిన అంకమయ్య ఫిర్యాదు చేయడంతో  దాదాపు రూ.2లక్షల జరి మానా విధిస్తూ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. ఈనేపఽథ్యంలో కాగా గురువారం రాత్రి సరుకులు తీసుకుని వస్తుండగా మోరంపూడి వద్ద దారికాచిన సర్పంచ్‌, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం ప్రభుత్వవెద్యశాలకు చేరుకున్నాడు. అంకమయ్య కథనం ప్రకారం.... సర్పంచ్‌ తన అనుచరులతో కలసి వచ్చి తనపై కత్తులతో దాడికి ప్రయత్నించాడని, అదేసమయంలో తన బావ రాకపోయి ఉంటే తనకేం జరిగి ఉండేదోనని భయాందోళనలు వ్యక్తం చేశాడు. తనపై దాడిచేయడమే కాకుండా, తన చేతుల్లోనే కత్తులను పెట్టి ఫొటోలు తీశారని పేర్కొన్నాడు. 

Updated Date - 2022-06-24T06:43:54+05:30 IST