రైలుకిందపడి కూలీ మృతి

ABN , First Publish Date - 2021-04-24T05:01:54+05:30 IST

ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం వాల్మీకిపురం పొలిమేరల్లో జరిగింది.

రైలుకిందపడి కూలీ మృతి
రైలుకింద పడి మృతి చెందిన కూలీ రమణ(పైల్‌ఫోటో)

 వాల్మీకిపురం, ఏప్రిల్‌23: ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం వాల్మీకిపురం పొలిమేరల్లో జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. వాల్మీకిపురం నమాజ్‌కట్ట వీధికి చెందిన సప్పిడి రమణ(50) జీవాలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.  కొంతకాలంగా మతిస్థితిమితం లేకపోగా వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణ పొలిమేరల్లోని బోగంపల్లె రిజర్వాయర్‌ సమీపంలో రైలు పట్టాలు దాటే క్రమంలో తిరుపతి వైపు వెళ్లే రైలు కింద ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వేపోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-24T05:01:54+05:30 IST