Duabi: గల్ఫ్లో తొలి దళిత బహుజన సభకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-08-05T13:23:38+05:30 IST
విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితుల కోసం దుబాయిలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితుల కోసం దుబాయిలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని విద్యాధికులైన దళిత బహుజనులను ఆకర్షిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్పై విదేశాలలో ఉంటున్న ఈ వర్గపు ప్రవాసీయులకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ తరుణంలో ప్రవీణ్ కుమార్ ఈ నెల 15 నుంచి అమెరికాలో నెల రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికాకు వెళ్తూ మార్గమధ్యలో దుబాయిలో ఒక రోజు ముందు గల్ఫ్లో ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. దుబాయిలోని అల్ ఖోజ్లో డలస్కో మీటింగ్ హాలులో 14న మధ్యాహ్నం ఒంటి గంటలకు ఈ సమ్మేళనాన్ని నిర్వహించననున్నట్లుగా నిర్వాహకులు చాకలి వెంకట్, మహతి రమేశ్లు తెలిపారు.