ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకం: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-25T19:39:12+05:30 IST
ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకం: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దళిత బంధు పేరుతో సీఎం మరోసారి మోసానికి తెరలేపారని ఉత్తమ్ అన్నారు. 2014 నుంచి ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. మంత్రుల మీద నమ్మకం లేక ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు.