దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ‘దళితబంధు’: గంగుల
ABN , First Publish Date - 2022-01-22T01:51:39+05:30 IST
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ధి
కరీంనగర్: దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ధి చెందుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసినవారు నేడు దళితబంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయమని అన్నారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కమలాకర్ ఆకాంక్షించారు.