అమెరికాలోని తెలుగువారి చూపు డల్లాస్ వైపు
ABN , First Publish Date - 2022-05-06T13:33:19+05:30 IST
అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి దృష్టి డల్లాస్పై పడుతోంది. ఆ నగరంలో తెలుగు వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అమెరికా నలుమూలల నుంచి రోజుకు సగటున 10 కుటుంబాలు తమ నివాసాలను డల్లాస్ నగరంలోని భవనాలకు మార్చుకుంటున్నాయి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, ఇంటి వద్ద ఉండి పని చేసుకునే సౌకర్యాలు అందుబాటులోకి..
(డల్లాస్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ): అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి దృష్టి డల్లాస్పై పడుతోంది. ఆ నగరంలో తెలుగు వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అమెరికా నలుమూలల నుంచి రోజుకు సగటున 10 కుటుంబాలు తమ నివాసాలను డల్లాస్ నగరంలోని భవనాలకు మార్చుకుంటున్నాయి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, ఇంటి వద్ద ఉండి పని చేసుకునే సౌకర్యాలు అందుబాటులోకి రావటం, తదితర కారణాల వల్ల డల్లా్సకు తెలుగువారి రాక రోజురోజుకు పెరుగుతోంది. 10 సంవత్సరాల క్రితం ఈ నగరంలో 30 వేల మంది తెలుగువారు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెండు లక్షలకు దాటిందని అంచనా. ప్రస్తుతం డల్లాస్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది.
తెలుగువారి పెట్టుబడులు కూడా ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏపీలోని అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెడదామనుకున్న వారు తమ మనసు మార్చుకుని డల్లాస్లో పెట్టుబడులు పెడుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్లా అభివృద్ధి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే, డల్లాస్లో తెలుగువారు పెరిగిపోవడంతో ఆ నగరంలోనే హైదరాబాద్ వాతావరణం నెలకొందని స్థానికంగా ఉన్న తెలుగు వారు అంటున్నారు.
డల్లాస్లో పెట్టుబడులకు ఇది సమయం కాదు
డల్లాస్లో పెట్టుబడులు పెట్టేవారు కొద్దికాలం పాటు వేచి చూడటం మంచిదని ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణుడు మల్లవరపు అనంత్ సలహా ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గృహాలు, భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. కరోనా అనంతరం ఈ పెరుగుదల భారీగా కనిపిస్తోందని, ఇది తాత్కాలికమేనని ఆయన తెలిపారు. డల్లాస్లో పెట్టుబడులు పెట్టడానికి తెలుగువారు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని అనంత్ చెప్పారు.