టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల డల్లాస్ ఎన్నారైల హర్షం!

ABN , First Publish Date - 2021-07-11T14:13:18+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల డల్లాస్ ఎన్నారైల హర్షం!

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల డల్లాస్ ఎన్నారైల హర్షం!

డల్లాస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల డల్లాస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టంగా తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్‌లో జులై 9న(శుక్రవారం) జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుగుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం జరగాలని ఆకాంక్షించారు.


ఈ అభినందన సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ లైవ్‌లో పాల్గొని ఎన్నారైలని ఉద్దేశించి ప్రసంగించారు. రేవంత్ రెడ్డితో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జూమ్ లైవ్‌లో పాల్గొని తన అభిప్రాయాల్ని సభికులతో పంచుకున్నారు. ఎన్నారైలు కేక్ కట్ చేసి సీతక్క జన్మదిన వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోవింద్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, చంద్ర రెడ్డి పోలీస్, వసంత్ రామ్ రెడ్డి, ఫణి రెడ్డి బద్దం తదితరులు పర్యవేక్షించారు.





Updated Date - 2021-07-11T14:13:18+05:30 IST