రాజ్యసభ సభ్యులుగా దామోదర్రావు, పార్థసారథిరెడ్డి ఏకగ్రీవం
ABN , First Publish Date - 2022-06-02T10:22:19+05:30 IST
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించవలసి ఉంది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ ఇద్దరి నామినేషన్లను ఆమోదించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం బుధవారం ప్రకటించింది. వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులని తెలిపింది. శ్రమజీవి పార్టీకి చెందిన భోజ్రాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ల నామినేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించింది.