డెంగ్యూ నివారణపై అవగాహన
ABN , First Publish Date - 2022-05-17T02:34:31+05:30 IST
స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రతిమ ఆధ్వర్యంలో సోమవారం డెంగ్యూ నివారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వై
సంగం, మే 16: స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రతిమ ఆధ్వర్యంలో సోమవారం డెంగ్యూ నివారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ డెంగ్యూ దినోత్సవం
ఏఎస్ పేట, మే16 : మండలంలోని చిరమన పీహెచ్సీలో సోమవారం వైద్యాధికారి డాక్డర్ రంతు న్నీసాబేగం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, దోమలు ప్రబలకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ ఎన్.జ్యోతి, ఆరోగ్యవిస్తరణాధికారి షఫీ, సలోమి తదితరులు పాల్గొన్నారు.