ధోనీ సెకండ్ ఇన్నింగ్స్.. కోచ్గా..?: పాక్ ఆటగాడి వైరల్ కామెంట్స్
ABN , First Publish Date - 2021-07-25T08:03:09+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొన్ని సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో..
ఇస్లామాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొన్ని సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్తో ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడేసినట్లేనని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కామెంటరీవైపు మొగ్గు చూపుతాడా..? లేక కోచింగ్ వైపు అడుగులేస్తాడా..? అనే ప్రశ్నకు కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘రిటైర్మెంట్ తరువాత ధోనీ.. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఎంఎస్ ధోనీ కామెంటరీ కంటే కోచింగ్ను ఇష్టపడతాడని అనుకుంటున్నా. ధోని త్వరలో కోచింగ్ ప్రపంచంలోకి ప్రవేశించి కొత్త వృత్తిని ప్రారంభిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను’ అన్నాడు.
ఇదిలా ఉంటే 2006లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు చివరిసారిగా కనేరియాను ధోనీ ఎదుర్కొన్నాడు. అతడి ఓవర్లో వీర బాదుడు బాదాడు. ఓ సిక్సర్తో పాటు భారీగా పరుగులు రాబట్టాడు. కాగా.. ఎంఎస్ ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2019 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో చివరిసారిగా ధోనీ భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీని ధోనీ ముట్టుకోలేదు. ఇక ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు.