రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: డీఏవో సునీత
ABN , First Publish Date - 2020-10-29T07:32:58+05:30 IST
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీఏవో సునీత అన్నారు. బుధ వారం మండలంలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, ఇసన్నపల్లి, మల్లుపల్లి గ్రా మాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గాల్రెడ్డి,
భిక్కనూరు, అక్టోబరు 28: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీఏవో సునీత అన్నారు. బుధ వారం మండలంలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, ఇసన్నపల్లి, మల్లుపల్లి గ్రా మాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గాల్రెడ్డి, డీఏవో, వైస్ఎంపీపీ యాదగిరి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం సూచించిన, మార్కెట్లో డిమాం డ్ ఉన్న పంటలనే సాగు చేయాలని కోరారు. మా ర్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ లేదని, దాని స్థానంలో నూనెగింజల పంటలను సాగు చేయాల న్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబా టులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బీ డైరెక్టర్ కిష్టాగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ నర్సింహారె డ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భగవంత్రెడ్డి, డీ సీవో శ్రీనివాస్, విండో చైర్మన్లు వెంకట్రెడ్డి, రాజా గౌ డ్, సర్పంచ్లు మధుమోహన్రెడ్డి, సుమలత, లక్ష్మీ, రాములు తదితరులు పాల్గొన్నారు.