సమాజ్‌వాదీ పార్టీలో చేరిన దారాసింగ్

ABN , First Publish Date - 2022-01-16T19:08:15+05:30 IST

యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మధుబన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ ..

సమాజ్‌వాదీ పార్టీలో చేరిన దారాసింగ్

లక్నో: యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మధుబన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ ఆదివారంనాడు లాంఛనంగా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లక్నోలో ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైని తరువాత బీజేపీ నుంచి ఎస్‌పీలోకి చేరిన మూడవ మంత్రి దారాసింగ్ కావడం విశేషం. మౌర్య, సైని, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గత శుక్రవారంనాడు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.


కాగా, అఖిలేష్ యాదవ్‌ను యూపీ తదుపరి ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకు రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని దారాసింగ్ తెలిపారు. 2017లో వెనుకబడిన వర్గాల ఓట్లతో గెలిచిన బీజేపీ ఆ తర్వాత వారికి చేసిందేమీ లేదని తప్పుపట్టారు. ఆ కారణంగానే బీసీలంతా సమాజ్‌వాదీ పార్టీకి తరలివస్తున్నారని చెప్పారు. బీజేపీని ఓడించి, గద్దె దింపేందుకు ఎస్‌పీలో చేరిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని చెప్పారు.

Updated Date - 2022-01-16T19:08:15+05:30 IST