చిత్తూరు జిల్లాలో దర్గాకు నిప్పు.. ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-18T03:23:21+05:30 IST

చిత్తూరు జిల్లాలోని జిలానీ బాబా దర్గా దగ్ధం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేవుళ్ల రథాలకు నిప్పు, ఇప్పుడు దర్గాకు....

చిత్తూరు జిల్లాలో దర్గాకు నిప్పు.. ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: చిత్తూరు జిల్లాలోని జిలానీ బాబా దర్గా దగ్ధం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేవుళ్ల రథాలకు నిప్పు, ఇప్పుడు దర్గాకు నిప్పు.. రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్‌ల బరితెగింపునకు నిదర్శనమన్నారు. సీఎం జగన్ రెడ్డి, మంత్రులు అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దర్గాకు నిప్పు పెట్టిన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఓ ప్రకటనలో చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-18T03:23:21+05:30 IST