ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-01-25T02:41:17+05:30 IST
మండలంలోని శ్రీవిష్నేశ్వర, కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మక ర్తల మండలి ప్రమాణ స్వీకారం సో
పొదలకూరు, జనవరి 24: మండలంలోని శ్రీవిష్నేశ్వర, కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మక ర్తల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ధర్మకర్తల మండలి చైర్మన్గా తన్నీరు సుబ్రహ్మణ్యం, సభ్యులుగా దాదిబత్తిన భాస్కర్రెడ్డి, ఊకోటి కళాభారతి, కొంగి హైమావతి, గిలకా కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి గోవ ర్థన్రెడ్డి మాట్లాడుతూ ధర్మకర్తల మండలిలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆర్యవైశ్యులకు చైర్మన్ అవకాశం కల్పించామన్నారు. ఎవరైనా తనపై విమర్శలు చేసేవారు ఆధారాలతో నిరూపిస్తే, ప్రజాజీవితం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి కాకాణి సవాల్ విసిరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమీక్షలో పాల్గొని, ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మండల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.