AP News: వైసీపీకి నిరుద్యోగులే బుద్ధి చెబుతారు : దాసరి శ్యామ్ చంద్రశేషు
ABN , First Publish Date - 2022-08-23T23:11:57+05:30 IST
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వస్తే 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ఏటా
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు (Dasari Syam chandra Seshu) జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వస్తే 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని నమ్మ బలికిన జగన్ (CM Jagan).. అధికారం చేజిక్కగానే హామీలను బుట్టదాఖలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం 214 ఉపాధ్యాయ (DSC) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడంతో శ్యామ్ చంద్రశేషు స్పందించారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీగా ఉండగా.. అరకోరగా భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్కు రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో తక్షణం ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.