టైరు బండిని ఢీకొన్న వాహనం
ABN , First Publish Date - 2020-12-04T04:46:26+05:30 IST
నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వాహనం టైరు బండిని ఢీకొంది.
నాయుడుపేట టౌన్, డిసెంబరు 3 : నాయుడుపేట-శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వాహనం టైరు బండిని ఢీకొంది. ఈ ప్రమాదంలో టైరు బండి తోలుతున్న మనోజ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఎల్ఎసాగరానికి చెందిన మనోజ్కుమార్ బైపాస్రోడ్డు సమీపంలో ఇసుకను దించేసి వస్తుండగా తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో మనోజ్కుమార్కు తీవ్ర గాయాలుయ్యాయి. ఎద్దులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.