ఐపీఎస్లు గులాబీ పార్టీకి గులాంలు: దాసోజు శ్రవణ్
ABN , First Publish Date - 2022-04-19T00:35:06+05:30 IST
ఐపీఎస్లు గులాబీ పార్టీకి గులాంలుగా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.
హైదరాబాద్: ఐపీఎస్లు గులాబీ పార్టీకి గులాంలుగా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు పనిచేయాలంటే.. డైరెక్ట్ గా టీఆర్ఎస్లో చేరాలని హితవు పలికారు. బదిలీల కోసం టీఆర్ఎస్ నేతల చుట్టూ పోలీసులు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బడాబాబుల కోసమే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.