‘చికోటితో టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యారు’

ABN , First Publish Date - 2022-08-01T21:49:39+05:30 IST

చికోటితో టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. సంబంధిత ఆధారాలు బయట పెడుతున్నామన్నారు.

‘చికోటితో టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యారు’

హైదరాబాద్: చికోటితో టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. సంబంధిత ఆధారాలు బయట పెడుతున్నామన్నారు. ఈడీ దాడులతో మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్కు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొండపాక బ్రాంచ్ లాకర్లలో చికోటికి సంబంధించిన క్యాసినో మనీల్యాండరింగ్ పత్రాలున్నాయని ఆయన చెప్పారు. మరో సూట్ కేసు టీఆర్ఎస్ నేత ఇంట్లో దాచారని సమాచారం ఉందన్నారు. లాకర్లలోని డాక్యుమెంట్లు బయటకు తెప్పించాలని డిమాండ్ చేశారు. ఈడీ అధికారులు బాంక్ లాకర్లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-08-01T21:49:39+05:30 IST