ఏడు తరాల తర్వాత జన్మించిన ఆడపిల్లకు మరపురాని బహుమతి.. చంద్రమండలం మీద స్థలం కొని రిజిస్ట్రేషన్!

ABN , First Publish Date - 2022-03-05T22:32:24+05:30 IST

వారిద్దరూ నగరంలో ప్రముఖ వైద్యులు.. వారికి పదేళ్ల కిందట ఓ ఆడపిల్ల జన్మించింది..

ఏడు తరాల తర్వాత జన్మించిన ఆడపిల్లకు మరపురాని బహుమతి.. చంద్రమండలం మీద స్థలం కొని రిజిస్ట్రేషన్!

వారిద్దరూ నగరంలో ప్రముఖ వైద్యులు.. వారికి పదేళ్ల కిందట ఓ ఆడపిల్ల జన్మించింది.. ఆ కుటుంబంలో ఏడు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడంతో వారంతా ఎంతో సంతోషించారు.. ఇటీవల ఆమె పదో జన్మదినోత్సవం జరుపుకుంది.. ఈ సందర్భంగా ఆ బాలికకు తల్లిదండ్రులు మరపురాని బహుమతి అందించారు.. చంద్రమండలంలో ఆమె పేర స్థలం కొనుగోలు చేశారు.. రిజిస్ట్రేషన్ పేపర్లను ఆ బాలికకు బహుమతిగా అందించారు. 


బీహార్‌లోని ఝంఝార్‌పూర్‌కు చెందిన డాక్టర్ సుర్వింద్ ఝా, డాక్టర్ సుధారాణి దంపతులకు పదేళ్ల కిందట ఓ బాలిక జన్మించింది. వారి కుటుంబంలో ఏడు తరాల తర్వాత జన్మించిన ఆడపిల్ల కావడంతో ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచారు. ఈ నెలలో ఆమె పదో వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో తమ కూతురికి ఆ తల్లిదండ్రులు మరపురాని బహుమతిని అందించారు. చంద్రమండలం మీద తమ కూతురి పేరు ఎకరా స్థలాన్ని రిజిస్టర్ చేయించారు. 


చంద్రమండలం మీద స్థలం కొని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏడాదిన్నర పట్టిందని సుర్వింద్ తెలిపారు. కాలీఫోర్నియాలోని లూనా సొసైట్ అనే ఏజెన్సీ వెబ్‌సైట్‌ ద్వారా సుర్వింద్ ఈ డీల్ పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లోనే మొత్తం పేపర్ వర్క్ పూర్తి చేసి, డబ్బులు పేపాల్ యాప్ ద్వారా చెల్లించారు. దాంతో స్థలం రిజిస్ట్రేషన్ పేపర్లు స్పీడ్ పోస్ట్‌లో సుర్వింద్‌కు చేరాయి. 


Updated Date - 2022-03-05T22:32:24+05:30 IST