తండ్రి చితికి నిప్పుపెట్టిన కుమార్తె!

ABN , First Publish Date - 2020-09-17T15:58:27+05:30 IST

ఈ రోజుల్లో స్త్రీ, పురుష బేధభావాలు సమసిపోయాయి. ఏ పనినైనా స్త్రీ, పురుషులిద్దరూ సమానంగానే చేస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతను కూడా మహిళలే వహిస్తున్నారు. చివరికి తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టే కార్యాన్ని...

తండ్రి చితికి నిప్పుపెట్టిన కుమార్తె!

ఆరా: ఈ రోజుల్లో స్త్రీ, పురుష బేధభావాలు సమసిపోయాయి. ఏ పనినైనా స్త్రీ, పురుషులిద్దరూ సమానంగానే చేస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతను కూడా మహిళలే వహిస్తున్నారు. చివరికి తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టే కార్యాన్ని కూడా మహిళలే చేస్తున్నారు. ఇటువంటి ఘటన బీహార్‌లోని ఆరా పట్టణంలోని ఎంపీ బాగ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఉత్తమకుమార్ మృతి చెందారు. అతనికి ఒకే కుమార్తె. కుమారులు లేరు. ఈ నేపధ్యంలో స్థానికులంతా ఉత్తమకుమార్ మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తండ్రి చికితి కుమార్తె నేహా కుమారి స్వయంగా నిప్పంటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి చివరి కోరికను తీర్చానని, ఆయన కోరుకున్నట్లు ఆయన చితికి నిప్పంటించి కుమారునిగానూ తన బాధ్యతను నెరవేర్చానని తెలిపారు.

Updated Date - 2020-09-17T15:58:27+05:30 IST