ప్రాణం తీసిన నిమ్మకాయలు.. ధరలు పెరిగిపోవడంతో అత్తా కోడళ్ల గొడవ

ABN , First Publish Date - 2022-05-02T08:30:50+05:30 IST

మండే ఎండలకు తోడుగా నిమ్మకాయల ధరలు కూడా మండిపోతుండడంతో సామాన్యుల విలవిల్లాడుతున్నారు. తాజాగా నిమ్మకాయల కోసం అత్తకోడళ్ల మధ్య మొదలైన గొడవ చివరికి ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది...

ప్రాణం తీసిన నిమ్మకాయలు.. ధరలు పెరిగిపోవడంతో అత్తా కోడళ్ల గొడవ

మండే ఎండలకు తోడుగా నిమ్మకాయల ధరలు కూడా మండిపోతుండడంతో సామాన్యుల విలవిల్లాడుతున్నారు. తాజాగా నిమ్మకాయల కోసం అత్తకోడళ్ల మధ్య మొదలైన గొడవ చివరికి ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా చైన్‌పూర్ గ్రామంలో గత బుధవారం కాజల్ దేవి(28) అనే యువతి హత్యకు గురైంది. హత్య జరిగిన సమయంలో ఆమె భర్త సునీల్ బైఠా, మామ(భర్త తండ్రి) వేరే ఊర్లో ఉన్నారు. ఇంట్లో కాజల్ దేవితో పాటు ఆమె అత్త, ఇద్దరు ఆడపడుచులు(భర్త సోదరీమణులు) ఉన్నారు. 


పొరుగింటి వారి కథనం ప్రకారం కాజల్ దేవి ఇంట్లో ఉన్న చెట్టు నుంచి ఎక్కువ నిమ్మాకాయలు కోసుకుందని గొడవ మొదలైంది. ఈ గొడవలో కాజల్ దేవిని.. ఆమె అత్త, ఆడపడుచులు ఆమెను చితకబాదుతూ ఇంటి లోపలికి తీసుకెళ్లారు. ఆ తరువాత సాయంత్రం అందరూ(అత్త, ఆడపడుచులు) హుటాహుటిన సూట్ కేసులు తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయారు. కాజల్ దేవి కోసం పొరుగింటి మహిళ ఇంట్లోకి వెళ్లే సరికి.. ఆమె ఉరి వేసుకొని చనిపోయనట్లు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 


Updated Date - 2022-05-02T08:30:50+05:30 IST