కొడుకే చనిపోయాడు.. ఇక ఇంట్లో నువ్వెందుకు అంటూ కోడలిని కొట్టి.. జుట్టు పట్టి ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి మరీ..

ABN , First Publish Date - 2022-08-24T21:16:29+05:30 IST

ఆ మహిళకు పద్నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది..

కొడుకే చనిపోయాడు.. ఇక ఇంట్లో నువ్వెందుకు అంటూ కోడలిని కొట్టి.. జుట్టు పట్టి ఇంట్లోంచి ఈడ్చుకొచ్చి మరీ..

ఆ మహిళకు పద్నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.. కరోనా సమయంలో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.. అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. అత్త, మామ ఆమెను హింసించడం (Domestic voilence) ప్రారంభించారు.. ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేంసేందుకు ప్రయత్నిస్తున్నారు.. దీంతో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. 


ఇది కూడా చదవండి..

Kanishka Soni Sologamy: మగాళ్లపై నమ్మకం పోయింది.. స్వీయ వివాహం వెనుక అసలు నిజాలను బయటపెట్టిన Kanishka Soni


రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్‌లో వైశాలి నగర్‌కు చెందిన అవధేష్ కుమార్ కరోనా కారణంగా 2021లో మరణించాడు. దీంతో అతని భార్య తరుణ శర్మకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెకు 12, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరి ముందు అత్తగారు రోజూ తరుణను కొట్టేవారు. కొడుకే లేనపుడు కోడలు తమకు అక్కర్లేదని అత్త, మామ చెబుతున్నారు. ఆమెను ఇంట్లో నుంచి గెంటేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోడలు వెళ్లకపోవడంతో ఆమెను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. తరుణను అత్త, మామలు కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 


తరుణ శర్మ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తరుణ అత్తమామలు రామేశ్వర్ ప్రసాద్, భగవతీ దేవిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైశాలి నగర్ పోలీసులును మహిళా కమిషన్ ఆదేశించింది.  

Updated Date - 2022-08-24T21:16:29+05:30 IST