పట్ట పగలు ప్రభుత్వ దోపిడీ

ABN , First Publish Date - 2022-07-01T09:17:49+05:30 IST

పట్ట పగలు ప్రభుత్వ దోపిడీ

పట్ట పగలు ప్రభుత్వ దోపిడీ

నిధుల మళ్లింపుపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు: మాధవ్‌

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పట్టపగలు దోపిడీకి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ తీవ్రమైన ఆరోపణ చేశారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ చేసిన డబ్బు డ్రా చేసి దొంగతనానికి పాల్పడిందని ఆయన విజయవా డలో ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు నిధుల దారి మళ్లింపుపై కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ‘మనం పీలుస్తోన్న స్వేచ్ఛా వాయువులకు కారకులైన దేశభక్తులను స్మరించుకోవడానికి వస్తోన్న ప్రధాని సభలో నల్ల జెండాలు ఎగుర వేయాలన్న ఎమ్మెల్సీ పండుల రవీంద్రను బర్త్‌రఫ్‌ చేయాలి. రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు, ప్రతిపక్షాలపై దాడులు, శాంతి భద్రతల లోపంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని మాధవ్‌ అన్నారు. ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్ము మాత్రమే కాదు.. అవకాశం ఉంటే ప్రజల సేవింగ్స్‌ను కూడా జగనన్న వదిలేలా లేరని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-07-01T09:17:49+05:30 IST