డీసీసీబీకి రూ.11.82 కోట్ల లాభం
ABN , First Publish Date - 2022-06-28T05:18:15+05:30 IST
మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ 2021-22ఆర్థిక సంవత్సరంలో రూ.11.82కోట్ల లాభం ఆర్జించిందని డీసీసీబీ అధ్యక్షుడు సి.ని జాంపాషా తెలిపారు.
పాలమూరు, జూన్ 27: మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ 2021-22ఆర్థిక సంవత్సరంలో రూ.11.82కోట్ల లాభం ఆర్జించిందని డీసీసీబీ అధ్యక్షుడు సి.ని జాంపాషా తెలిపారు. సోమవారం డీసీసీబీ ఆడిటోరియంలో మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-22ఆర్థిక సంవత్సరానికి 102వ వార్షిక నివేదికను లా భ, నష్టాల పట్టికను సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమో దించారు. వానాకాలం సీజన్కు రైతులకు అవసరమైన పంట రుణాలను అందించాలన్నారు. స మావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, కె.మంజుల, జి.వెంకటేష్, యం. విష్ణువర్ధన్రెడ్డి, డి.బక్కన్న, ఇ.రంగారెడ్డి, కె.వంశీధర్రెడ్డి, కె.యస్.లక్ష్మీ నారాయణ, పి. నరసింహులు, యం.చంద్రానాయక్, మేనేజర్ వెంకటేష్, కోదండరాములు పాల్గొన్నారు.