డీడీగా సంధ్యారాణి బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2020-12-03T05:20:17+05:30 IST
ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా సంధ్యారాణీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జీ డీడీగా పని చేసిన చందనసర్పేను ప్రభుత్వం బదిలీ చేయగా ఆమె స్థానంలో సంధ్యారాణీ నియామకమయ్యారు.
ఉట్నూర్, డిసెంబరు 2: ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా సంధ్యారాణీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జీ డీడీగా పని చేసిన చందనసర్పేను ప్రభుత్వం బదిలీ చేయగా ఆమె స్థానంలో సంధ్యారాణీ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పని చేసిన అనుభవాలు ఉండడంతో గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం, దినసరి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నూతన డీడీని సన్మానించారు. ఇందులో కేబీసీ నారాయణ, సోనేరావు, బాపురావు, బాబు, విఠల్, నితిన్, సుదీర్, సౌమ్య, చందర్, సంతోష్ పాల్గొన్నారు.