మురుగు కాల్వ పక్కన మృతశిశువు
ABN , First Publish Date - 2021-12-04T05:34:26+05:30 IST
నంద్యాల పద్మావతినగర్లోని ఓ షాపింగ్ మాల్ వద్ద మురుగు కాల్వ పక్కన శుక్రవారం మృత శిశువును స్థానికులు గుర్తించారు.
నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 3: నంద్యాల పద్మావతినగర్లోని ఓ షాపింగ్ మాల్ వద్ద మురుగు కాల్వ పక్కన శుక్రవారం మృత శిశువును స్థానికులు గుర్తించారు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రమణ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృత శిశువును పరిశీలించారు. సమీప ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. అక్కడి నుంచి పాప మృతదేహాన్ని తెచ్చి పడేశారా? లేదా ఆడపిల్ల పుట్టిందని అక్కడ తెచ్చి పడేయడంతో శిశువు మృతిచెందిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.