నిన్నటి నుంచి ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయంటూ పక్కింటి వాళ్ల ఫోన్‌తో పోలీసులు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-04-20T22:08:15+05:30 IST

అతను తన భార్య, కొడుకుతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.. రోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడు.

నిన్నటి నుంచి ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయంటూ పక్కింటి వాళ్ల ఫోన్‌తో పోలీసులు వెళ్లి చూస్తే..

అతను తన భార్య, కొడుకుతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.. రోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడు.. అతని భార్య, కొడుకు కూడా తరచుగా బయటకు వెళ్లి వచ్చేవారు.. అలాంటిది శుక్రవారం ఉదయం నుంచి ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు.. శనివారం కూడా వారెవరూ బయటకు రాలేదు.. దీంతో అనుమానం వచ్చిన పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. 


రాజస్థాన్‌లోని సికార్‌‌కు చెందిన సంపత్ అనే వ్యక్తి తన భార్య పూజ, రెండేళ్ల కొడుకు చినూతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ ముగ్గరూ తమ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారు. పూజ, చినూ మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. 


సంపత్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఇంటి పరిస్థితులను బట్టి చూస్తే బయటి నుంచి ఎవరూ లోపలికి వెళ్లలేదని అర్థమవుతోది. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యను, కొడుకును చంపేసి సంతోష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి విషయాలు బయటపెడతామని తెలిపారు. 

Updated Date - 2022-04-20T22:08:15+05:30 IST