కాలువలో గుర్తు తెలియని మృతదేహం
ABN , First Publish Date - 2021-10-27T06:24:49+05:30 IST
కాలువలో గుర్తు తెలియని మృతదేహం
పెదపారుపూడి: వానపాముల గ్రామం వద్ద సౌత్ చానల్ కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృత దేహాన్ని గుర్తించినట్లు ఎస్సై సి.రంజిత్ కుమార్ తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, శరీరంపై నీలి రంగు చొక్కా ఉందని, గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉండటంతో ఒంటిపై గుర్తులు నమోదు చేశామని తెలిపారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించామని ఆయన అన్నారు.